shabd-logo

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023

62 చూడబడింది 62

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూడ తన్మయత్వముతోఁ గొంతసేపు పరువెత్తు న గొంతసేపు తొందరగాఁ దిరుగుచు నుండెను. పది పదమూడేండ్లు లోబడిన బాలురంద ఆయమ పోయినంతమేఱ నామె వెంట బువెత్తునుండిరి. ఆ వీథి చినర రావిచెట్టుక్రింద సభతీర్చిన కొందరు పెద్దలు తమలోఁదాము రాచకార్యము లాలోచించుకొనుచు మధ్య నీయమ్ సంగతియుఁ బ్రస్తావించుచుండిరి.

ఒకరు— మరల గణాచారి బయలు దేరిన దే!

మరొకరు—గణాచారిలేదు. గిణాచారిలేదు. ఇది యొక యాట. నయసులో నున్న యాఁడది సిగ్గులేక యిట్లూరి వెంట గంతులు వేయుటకు తల్లిదండ్రు లొప్పుకున్నందుకుఁ జెప్పవలయును. ఇంకొకరు — ముసలి జమీందారుగారు పోదు రని ఆఱునెలల క్రింద గణాచారి చెప్పెగదా! గణాచారి కాకపోయిన నెట్లు చెప్పఁ

గలిజను?

చేతొకరు — గ్రుడ్డివాని చేతి తాయి! తగిలినఁ దగులును; తగులదును.

అప్పటికిఁ బదిగడియలు ప్రొద్దెక్కెను. వేసంగి. ఈదురుగాలి. కొట్టుకుండెను. బడి వదలిపెట్టిన పిల్లలు పలకలు, పుస్తకాలు చంక బడి, నుదురులఁ బోసినచెమ్మటలు చొక్కాలు పైకిలాగికొని మమం క్షేతులతోఁ దుడుచుకొనుచు గుఱ్ఱములు ఖదను త్రొక్కినట్లు ఖరువులెత్తురు గృహాభిముఖులైరి. కడుపునిండ బుస్వతిని పాలేరు

బుజ్జవాండ్రు రావియాకు చుట్టలు కాల్చుచుఁ బశువులను బొలాలకుఁ దోలుకొని బోవు నుండిరి. గొల్ల ముసలమ్మలు పశువులు పోవు వేసిన సేవకళ్ళికై పోరాడు కొనుచుండిరి. బ్రాహ్మణ స్త్రీలప్పుడే యిండ్ల లోని పనులు ముగించుకొని, మడిబట్టలుదుకుటకు బుజాలమీఁద్ర వేసికొని చెఱువునకుఁ బోవుచుండిరి. మాలెతలు సొలముమీఁద బని సేయుచున్న భర్తలకుఁ దట్టలలో బున్వయు నీమును దీసెకొనిపోవు చుండిరి. ప్రాతఃకాలము తెలియకుండ మధ్యాహ్న మగుచుండెను. ఆ జాము ప్రొద్దెక్కిన యెండలలోఁ గ్రమ క్రమముగా వెచ్చదనములు ముదురుచున్నను, గాలిపొరలింకను గోరువెచ్చనగానే యుండెను. ఆ గోరువెచ్చదనములకే గణాచారి తాళలేక పోయినది. ఆమె కొంత సేపటికిఁ బోయి రావిచెట్టుక్రింద నున్న పెద్దమనుష్యులనద్ద కూర్చుండెను. ఆమె రాకతో వారి ప్రస్తాననము నాగిఁసోయెను.

ఇప్పుడు సుబ్బన్న పేఁట మున్న ప్రదేశమంతయు మూఁడు నందల యేండ్ల క్రిందట మహారణ్యము. ఆయరణ్యములో నొక చిన్న పల్లె యుండెడిది. ఆ పల్లెలో నొక పేద కాఁపు కాపురముండెడివాఁడ్రు. ఆతఁడు అడవిలోని పుల్లల నేఱి తెచ్చి, కట్టెలకొట్టి తెచ్చి, యవి దూరపుఁ బట్టణములకుఁ బోయి యమ్ముకొనుచు జీవించును. అతని కొక యా వండెడిది. అది కపిల. ఆ యావు సొగసేసొగసు. అది కుండంత పొదుగుతో నిగనిగలాడు మేనితో, గుజ్జురూపుతో, విదియనాఁటి చందుకుని శృంగములవంటి శృంగములతో, మెడలోని దృష్టిత్రాడుతో నడవులకుమేతకై పోవునపుడుగాని, నచ్చునపుడుగాని జములకు దానిఁమీదఁ జూసేచూపు. ఆ కాఁపున కా కసిల వాఁతిట నొదిగియున్న నందినీ ధేను. అతని యల్లారుముద్దుబిడ్డల పాలిఁటి కాణాచి. దాని సతయు వేయికన్నులతోఁ గాపాడుకొనును. ప్రొద్దున నా తల్లి కుండెడు పాలిచ్చి యడవులకుఁ బోసను. రాతిరికి నచ్చి మఱలఁ గుంఁడు పాలిచ్చును. ఈ పాలతో సతని కాఁపురమునకు వేతేపంటలే అక్కఱ లేక పోయినవి. శ్రీ మహాలక్ష్మివలె నావు నచ్చినను, పోయిసనుఁ గన్న యాకాఁపు కన్నులు చల్లని వెన్నెలలు కాయుచుండెను.

పుట్టలోనుండి యొక దిశ్యసర్పము వెలికి నచ్చి, నోరు తెఱచి, పొదుగు పెద్ద పడగవిప్పి నిలచియుండెను. కాఁపునకుఁ గనులు బైరులు బొమ్మను. కాఁపు కొంతసేపటికిఁ దమాయించుకొని తలగుడ్డతీసి నెలపైఁబట్టి మ్రొక్కి యట్లే చూచుచుండెను. ఆవు పొదుగునుండి పాలు ధారగా జాఱునుండెను. పాము త్రాగుచున్నది కాబోలు! తాను కనులతోఁజూచినది భార్యకుఁ జెప్పనలయునని కాఁపు', మన స్సులో సనుకొ నేను. కాంపు మఱల (జూచెను. ఒక శిరసుకాదు; ఆ బీర్పముసకు రెండు శిరస్సులు. ఈ మహత్తు ఊరందరికిఁ జెప్పవలయు అనుకొన్నాడు కాఁపు, మఱలఁ జూచెనుగదా సర్పమునకు నాలుగు తెలలు,

కాఁపునకుఁ దల తిరిగిపోయెను. దిగ్భ్రాంతుఁడై యతఁ-డచ మూర్ఛఁ బడిపోయెను. కాంపు కన్ను తెఱచుసరికి యా నతని వీటి వచ్చి నీలువబడెను. ఆతఁడు నెమ్మదిగ లేచి దూడను వెదకు మాపునెంట నింటికినచ్చెను. ఆవు నడచినంతసేపు దాని గుకు లతని ప్రాణముమీఁద్రఁ బడుచున్నట్లు అతఁ దూహించు యంకెను. ఇంటికిఁ జేరినంతనే యతని భార్య యేదో విశేషము జరిగిన అని మాతని ముఖలక్షణములఁబట్టియే గ్రహించెను. జరిగినదంతయు పండు పూసగ్రుచ్చినట్లు ఆమెకుఁ జెప్పెను. అప్పుడే ఈ సంగతి మూలలఁ బొక్కి యానోట నానోట నూరి నలుగురికిఁ తెలి అందఱును నచ్చిరి. ఆవునుజూచిరి. ఎనరికి నేమి చేయనల తెలియలేదు.

ఆ రాత్రి యా కాఁపునకుఁ కలలో వేయిశిరసులతో సుబ్ర రావ్యశ్వరస్వామి కనఁబడి తనకు గుడి కట్టించు మనియుఁ నావు పాతాను త్రావిన చోటుననే యది కట్టించనలయు ననియుఁ అప్పుడు. మఱునాఁడు కాఁపు సర్వపృత్తాంతము నూరివారికిఁ జెప్పెను. "ను ఆవేశ పూరితులయిరి. కాని యా యూరిలో నుస్న వా ఓలును పేద లే. అచ్చట నాలయము కట్టించఁ గల సామర్థ్య ఎవ్వరికిని లేదు. ఆ కాఁపు మాత్రము తన ద స్తినంతయ.. వర్మ మన చేసకు గుడికట్టింతు సనుకొనెను. కాని యా దూ సి ఒక యావు, ఒక పూరిపాక. ఆవు అదినరకే భగవంతునకు

గైనసమయ్యెను. పూరిపాక కొనువా రెవ్వరు? ఎవరైన గొందురే యనుకొందము . మూడు రూకలు నచ్చునేమో! ఈ డబ్బుతో దేవునకు మరియొక పూరిపాకయయినను కాదు; గతియేమి?

ఇది యిట్లుండఁగా స్వామి మహత్తున కానాఁటినుండి యూరి లో దాఖలాలు కనఁబడుచుండెను. ఊరి పెద్దకాఁపు కొడుకునకు నొడ లంతయుఁ బళ్ళెకలు లేచెను. స్వామికి మ్రొక్కుకొనఁగా నని శాంతిం చెను. ఒక స్త్రీ పది కండ్లనుండి యున్న చెవిపోటు స్వామికి దీపా రాధన చేయించగా దగ్గిపోయెను.

ఈ మహత్తు నానాఁటఁ జుట్టుపట్ల వ్యాపించి జనము తీర్థప్రజ యయిపోయెను. అచ్చట కామడ దూరమున్ను యొకపాటిగ్రామ మనఁ గొంచెన స్తిపరుఁడైన యొక బ్రాహ్మణునకు సంతానము లేదు. ఆయన తనకు సంతానము కలిగినచోఁ దాను వచ్చి స్వామి సన్నిధినే యుందుననియు, స్వామి కాలయ ప్రయత్నములు చే సిద ひゃ ననియు మ్రొక్కుకొను. ఆ మఱుసంవత్సరమున నాయన భార్య గర్భ సయై కుమారునిఁ గనెను. అతనికి నాగేశ్వమ శాస్త్రీయని పేరుపెట్టు కొని యా బాహ్మణుడు తన సర్వమైన యాస్తితో, దలివచ్చి స్వామివద్ద నివాస మేర్పఱచుకొని యప్పటినుండి తదాలయనిర్మాణ ప్రయత్నిముమీఁద్రనే యుండెను. ఆ బ్రాహ్మణుఁ డఢ్యయనము చక్కఁగాఁ జీసినవాడు. జ్యోషమునందు, వాస్తువునందు సఖండ ఈయన యీ ప్రశస్తిని విని యొక నాం డీయనను దర్శించుట కొక భాగ్యశాలి వచ్చెను.

ఆ భాగ్యశాలిః సయ సేఁబది యేండ్లు. పుస్త్రీలు, మీసములు, వెడల్పయిన దనిడి యెముకలు, ఎఱ్ఱచారలు గలిగిన విశాలములైన కనులు, ఆజానువాహును, దృఢకాయుడు, చూచినవారి కతఁడు ఏ హాయోగ పురుష నివోఁగల్పించును. ఈ వేలకియేయులతఁడు సామాస్య సంసారియే కాని మానే నగ్చునప్పటికి అతని జాతకము తిరిగెను. అతఁడు పూర్వ మైదాలు జతల యెడ్లను పెట్టుగొని కిరా యికఁ దోలుచు జీవించెడివాఁడు. ఇంగ్లీషువారు టిపు సుల్తానుమీఁది దండయాత్రకఁ బోయినప్పుడు వీని యెడ్లనుూడ బాడుగకు దోలించుకొనిరి. వాకు టిప్పును గెలిచి శ్రీరంగపురము దోచుకొ కోటలో నొక కొట్టు చూపించి యందులో నేమున్నావో తెలియక మీ యితిని నంతిని చూపించిరఁట. అతని యదృష్టము! దాని నిండ తెలిసి లుండెను. అని యతడు రహస్యముగా నష్టమీఁది కెత్తు అని యింటికిఁ దోలుకొని వచ్చెను. అతని పేరు వీరస్న. ఇప్పుడా శీలముతో వాడొక కోటకట్టి పెద్దడమీందారుకానలయునని యూహ. ఆ కోట యెచ్చటఁ గట్టవలెనో అది యీ బ్రాహ్మణునిఁ గనుఁగొన యతిని మూయనవద్దకు నచ్చెను. బ్రాహ్మణుసకును వెదకం పోయిన తీగ కాలికిఁ దగిలిన ట్లయ్యెను. అతఁడు లోన సంతోషిం పె దైనమే యలేనిని మననద్దకుఁ దెచ్చెననియు భావించెను. బ్రాహ్మణుఁడు వీరన్న నాయతోఁ గోటకట్టుటకు యోగ్య స్థలము తా నున్నదే యనియు, నచ్చటి స్వామి స్థలము త క్షేత్రపాలకుడుగా సది దిన్యస్థలము కాబోపుతున్న దనియు, అట నిర్మించిన పట్టణము మూఁడు నాల్గు నందల యేండ్లవుకు మ హా అనుభవించు వినియుఁ జెప్పి వీరన్న నాయని దాని కనుమతింపఁ తీయ్ నాయుడు తనకోటయు, స్వామి యాలయమును నొకే శుభ విచార మున నారంభించెను.

ఇంతలో నొక వింత జరిగినది. ఏ యాపుసాలు స్వామిత్రాపు గరికెనే, ద దూపుగల కాఁవున కొక్క తెయే కూతురు. ఆమె తప్ప బదునాఱు పదునేడేండ్లుండును. వివాహముకాలేదు. అప్పు ఇప్పుడు స్వామి యామె నావేశించుచుండెను. పిల్ల యదను దప్పు అన్నిదిని శాఁవు ఆమెకుఁ బెండ్లిప్రయత్నము చేయును. ఆ ప్రస్తా వేసినవు వెల్ల నామె విఱచుకొని పడిపోవును. 'తప్పుతప్పు' అని కడ్రులు చెంపలు వేసికొందుకు. ఆమె మఱల లేచి కూర్చుం కరు అసలు ప్రకృతిలో నున్న సొగసే యిది. ఏవైన నొక వింత Jతో గొందరవనందురు, కొందఱుకాదందుకు. కొందలు సమ్మ కొందలు సమ్మ. అలైయీ గణాచారి గూర్చి కొందఱు ఇతడు చేయు నిచ్చిరి. వారందలకు నేదో చిన్న కొన్ని లతలు రా మొదలిడెను. అందుచే విశ్వాసమే ఎక్కునగా ఉంచెను.

క్రవక్రమముగా నా యూరికి సుబ్బన్న పేట యను పేరు వచ్చెను. అది పెద్ద గ్రామమయ్యెను. ఆలయమును, గోటయుఁ బూర్తియగుటకుఁ బనియేండ్లు పట్టెను. ఆలయముకన్న ఁగోటిఁ యంద మైనది. కోటికన్న నాలయ మందమైనది. ఎచ్చ టెచ్చటి వారును వచ్చి దేవుని దర్శించిపోదును. కోట చూచిపోదురు. కాని జరిగిన నొక్క చిత్రము . జమీందారు కట్టించిన చూలయము సుబ్రహ్మన్య శ్వ విదా? నాగేశ్వరస్వామిదా? గ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యశ్వ ప ఁ జిన్న్్న లయము గట్టించెను. కాశీనుండి గొప్ప మహత్తుకల శివలింగము తెచ్చి నాగేశ్వరస్వామి యన్న పేరుతో దానికిఁ బ్రతిష్ఠ చేసెను. ఈ దేవాలయములో నొకమూల నీ సుబ్రహ్మణ్యస్వామి యాలయమున్నది.

వీరన్న నాయుఁడు గారికిఁ జిన్నప్పటినుండియు విష్ణుభక్తి యెక్కు. అందుచేత నాయన వేజే వేణు గోపాలస్వామి యాలయ మొకటి కట్టించెను. రాజు స్వాములకు నిత్యధూప దీప నైవేద్యము లకుఁ గల్యాణోత్సవములకు, భోగములకుఁ బ్రత్యేకములైన యేర్పా టులు చేసేను. గొప్ప సన్నాయి పాటగాండ్రు, మంగలులు వచ్చి మిరాశీలు సంపాదిం చుకొని యీగ్రామమున నినసింపజొచ్చిరి. దేవదాసీలు వచ్చిరి. వైష్ణవోత్తములు విచ్చేసిరి. శైవు లకుదెంచిరి. అందఱకు రాజు వీళ్ళేర్పరచెను.

“దివఱకు జిన్న పల్లెయైన యాచోటు నేఁగు దేవతలకు విలున నీడ్ యయ్యెను. భ క్తులకుఁ గొంగు బంగార మయ్యెను. ధర్మ సునకు నివాసస్థానం య్యెను. ముక్తికి మార్గమయ్యెను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిచినఁలుకు వైనము. గణాచారి ముఖముస నున్న యాదలు చెప్పును. రిహానము లుపస్యసించును. అవిసయములు శిక్షించును. అంది వీళ్లే నూరెల్ల స్వామిుమున్నచో గడగడ. అందు చేత భక్తిప్రపత్తులును ప్రబలినిని.

వీరన్న నాయనికుమారుఁడు నాగన్న నాయఁడు. తండ్రి చని పోయి కొడుకు రావ్యమునకువచ్చెను. ఈ దేవాలయాదినిర్మా హేతు పైన యా బ్రాహ్మణుఁడు చనిపోయి, యాయన కుమారుఁడు నాగే శ్వరశాస్త్రి పెస్తావిదారయ్యెను. ప్రాత గణాచారి గతించి యామెన అన్ని రకూఁతురు మజల గణాచారి యయ్యెను. ఆమెకు మఱల వివాహప్రయత్నములు చేసిరి. చేసినపుడెల్ల నామెయు స్మృతి తప్పి ఓడిపోవుచుండెను. అందుచేత నామెయు సవివాహితగానే యుండెను. రీతిగా నా కాఁపునింట నొక్కతియే యాఁడశిశువు కలుగుటయు, రామ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గణాచారి యగుటయు నానువాయిత Jయి పోయెను.

వీరన్న నాయని వంశమువారు స్వామికిఁ బ్రతినిధులు. బ్రాహ్మణ బింకమ నాకు ప్రచారకులు. కాఁపువంశపు టాఁడుపడుచులు స్వామి వ్యాఖ్యాతలు. ఈరీతిగా భూమ్యాకాశములమధ్య స్వర్గమర్త్య తాళముల మధ్యఁ బ్రత్యమో ప్రత్యక్షములమధ్య నొక స్థిరమయిన సం బంధ మేర్పడెను.

పైని భగవంతుఁడు, క్రింద రాజును, బ్రాహ్మణుడును. ఈ రెండు మహాసంస్థలకు మధ్య గణాచారి త్రెంచరాని లంకె.

ఇది నాల్గు స్తంభములధర్మమంటపము, స్వామి, జమీందారు, గ్రాహ్మణుఁడు, గణాచారి వీరు సల్గుకు స్తంభములు.

ఈ మంటపములో సుబ్బన్న పేఁట్రప్రజలు మహోత్సనములు చేయుచుందురు. ధర్మార్థకామమోక్షము లను సజటిచెట్లు కట్టిన నాల్గు స్తంభములు నిత్యము శుభచిహ్నములై, అభన హేతువులై యుండెను, పచ్చనై

ఈ ధర్మమంటపము, నిత్యకళ్యాణము, పచ్చతోరణముగా ఎడు పందల యేండ్లు నిరంతరముగా, సవ్యసహితముగా శోభాయ మామై యొప్పెను. ఈ మూఁడునందల యేండ్లలో వేయిపడగలతో కాసించిన నాగేశ్వరస్వామి సుబ్బన్న సేఁటమీఁద తన సహస్రఫణా తండలి ఛత్రముగాఁ జాచి యా చల్లని నీడలో నాయూరిప్రజల పాటను వాకును ధర్మమోక్షములమధ్య నూఁగుచున్న యర్థ కాలము లను నుయ్యెలలో సుఖనిద్ర గాంచుచుండిరి,

ఇన్నినాళ్ళు స్వామి పడగలు ప్రజలకుఁ జల్లనినీడ నిచ్చుటకు 00 ఫైను; గాని కాటువేయుటకు విరియలేదు. స్వామి రెండువేల ఇత్నలు ధర్మముచేత బొండుమల్లెలు విరిసినట్లున్న నాల్గుదిక్కు లు తనివి దీరఁ జూచుచుఁ బ్రశాంతజ్యోతిస్సులు విరఁజిమ్మెనుగాని, ధర్మ చ్యుతికుషితములై రక్త కాంతులు పెదఁబల్ల లేదు.

సుబ్బన్న పేఁట కట్టించిన బ్రాహ్మణుఁడే యాయూరు మూఁడు నాల్గునందల యేండ్లుండునని నిర్ణయించెను. అంత జ్యోతిశ్శాస్త్ర పారంగతుఁడు, అంత వాస్తువిజ్ఞాత, అంత సర్వజ్ఞ శేఖరుఁడు, సుబ్బన్న పేఁటను నిత్య మైనదానినిఁగా నేల చేయలేదని యిప్పటి యా యూరి లోనివారి కొందఱ వాదము. కాని యాయన సర్వజ్ఞఁడేగాని సర్వాధి కారి కాదు. వాస్తు విజ్ఞాతయే గాని వాస్తు నిర్మాతగాఁడు. శాస్త్ర పారంగతుఁడే గాని గాఁడు.

మూఁడునందల హండ్లయినతరు వాత సుబ్బన్న పేఁట నశించి పోవుటకు బీజనిక్షేపము కలుగుసనియు నాయన నిర్దేశించెను. ఆహేతు వులు పుట్టినవని నేఁటి గణాచారి సూచించుచుండెను. కాని యూరిలోఁ జాలమంది గణాచారివాక్యముల యందనాదరము చూపుచుండిరి. *

అట్లు ముదురుచున్న యెండలకుఁ దాళలేక గణాచారి పోయి రావి చెట్టుక్రిందఁ గొంత సేపు కూర్చుండి, సన్ననిగొంతుకతో 'వేయి పడగలపాము విప్పారుకొనివచ్చి' అని పాడ మొదలిడెను. అందులో నొక యువకుఁడు వద్దని యితరులు కనుసన్నలతో వారించుచున్నను, నామె కెదురుగా నిలునుండి యిట్లనెను: “ఏమమ్మా! గణాచారి! ఈ సిచ్చిపాట లెందుకు? వేయిపడగ లేమిటి, రాజును కఱచుట యేమిటి? అదియును గలలో వచ్చి కఱచినదా? ఈపాటి కీ పాట చాలించి యింటికీ సముప్పము. నడివయస్సులో నున్నావు. కులము వారి కప్రతిష్ట తెచ్చుచుంటివి. సెండ్లియు లేదు, పెటాకులు లేదు. పెండ్లి పేరెత్తి నంతనే 'హూహూహూ' యని పడిపోదువు. అన్నియు వేషములుగా నున్నవి. నీవు నిజముగా గణాచారివే యయినచో నీకుఁగూడఁ జెమట యేల పోసినది? నీకును సలసట వేల వచ్చినది? నీవు నిజముగా దేవునిదానవే యయినచో, నేదీ? నీ మాహాత్మ్యము చూపించుము. నేను నిన్నిట్లు ధిక్కరించుమన్నానుగదా, నన్నేమియుఁ జేయలే వేమి?" అని విజృంభించుచుండగా సచ్చటనున్న మఱియిద్ద అతనిని బలనంతముగా సటనుండి లాగుకొనిపోయిరి. ఎ.ఆకొండ "జితని కిదితెగడు. మఱి పిదపకాలము వచ్చినది. అబ్బా! యిది యేమి పగులఁ అడిపోవట! ఈకలపువారందఱు చెప్పెడివారు లేక చెడిపోవు తున్నా”రని యనిరి. అపైనని, కొదని వేవిధము లయిన వాదములు తీయలుదేఱినవి.

ఇది జరిగినంత సేపు గణాచారి ఏమియు మాటాడలేదు. ఒకటి రెండుసార్లు తలయెత్తి యా యువకునివంకఁజూచెను. ఒక సారి జనము అంతయుఁ బరిశీలించెను.

జనము క్రమక్రమముగా నెనరిదారిని వారు పోఁజొచ్చిరి. చిన కక గణాచారి యొక్క తెయేయా చెట్టుక్రింద మిగిలెను. రెండు కాములు కావచ్చినది.

వేసంగి మండు టెండలు లేత రావి సూనులమీఁదఁ బడి ధగ భగలాడికదలినపుడు తతళ మెరియు గోదుమన్న త్రాచుల పడ గలపలెఁ బ్రకాశించుచుండెను. రావియాకుల చిన్ని చిన్ని తోడలు అంచిన నాల్కలవలెఁ తోఁచెను. దూరమున నాకాశములోఁదెల్లని అని మబ్బులు పలుచనై చెరలాడి తెల్లత్రాంచులు మసక లాడి ఇట్లు పడగలు విప్పినట్లు, ఒకదానిపై నొకఁడు దూకి కఱచు కొన్నట్లు పరసళ్ళు త్రొక్కి నట్లు నానారీతుల గోచరించెను.

ఎండ యేమో కస టెక్కి మహాభుజంగ మొకఁడు కుపితమై అస్సు మని పడగవిప్పి లోకమీఁద్ర లేచి నిలచినట్లు దుర్నిరీక్ష్య తీయిపోయెను.

అంత గణాచారి లేచి యింటికి బయలు దేతెను. దీర్ఘములై అర్ధనిమీలితములైన యామె కనులు సగము విరిసిన నల్లత్రాఁదు పడగలవలె, నక్షికోణముల ముడుతలువడిన గీతలు చాంచిన నాల్కల భయంకర మందహాసము చేసెను. అట్లుపోవుచున్న గణాచారి చెరుకుగా నొక మహాపురుషుఁడు నచ్చుచుండెను. అతనిని జూచి అంతన గణాచారి వికృతహాసముచేసి యతని కెదురుగాఁ బాడుచుం వస్తాను.

"వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” ఈ పాట పాము బుసకొట్టినట్లుచ్చరించినది గణాచారి.

విశ్వనాధ్ సత్యనారాయణ ద్వారా మరిన్ని పుస్తకాలు

36
వ్యాసాలు
వెయ్యి పడగలు
0.0
ఈ కథ మూడు శతాబ్దాలుగా సుబ్బన్నపేట అనే గ్రామంలో నివసించే వారి జీవితాలను వివరిస్తుంది. కుల వ్యవస్థ, దేవాలయం, కుటుంబం మరియు పొలం వంటి సాంప్రదాయ సామాజిక నిర్మాణాలలో వచ్చిన మార్పుకు గ్రామ అదృష్టానికి దగ్గరి సంబంధం ఉంది.
1

"వేయి పడగలపాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును” మొదటి అధ్యయము

5 December 2023
3
0
0

సుబ్బన్న పేఁట వీధులలో నొక యువతి యిట్లు పాడుదు గంతులు వేయుచు, మొగమున నున్న పెద్ద కుంకుమబొట్టు చెమటకు శాటిపోవుచుండగాఁ జేతనున్న వేఁపమండ మాటిమాటికి నూఁగు లాడించుచు, జుట్టు విరియఁబోసికొని, పయ్యెద తొలఁగుటగూ

2

రెండవ అధ్యాయము

6 December 2023
2
0
0

ఆ నచ్చుచున్న మహాపురుషుఁడు దబ్బ పండువంటి దేహ చ్ఛాయవాఁడు. కోలయు, గుండ్రము కాని ముఖము. ఆజాను బాహువులు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము, నయ సిరువది యేండ్లుండును. అతని పేరు ధర్మా రావు. ధర్మారావు రామేశ్వరశ

3

మూడవ అధ్యాయము

6 December 2023
1
0
0

ధర్మారావునిలిచి గణాచారి కనులలోఁ జూచెను. గణాచారి నిలఁబడి "ఏ ఎట్లు చూచెదవు? రాజు చెడిపోయినాఁడు. వేయిశిర సుల నాగు రాజును గలలో స్పృశించినది." అనెను. ధర్మారావు మాటాడకుండ నాలయాభిముఖుఁడై చనెను. గణాచారి యతని

4

నాలుగవ అధ్యాయము

6 December 2023
1
0
0

రంగారావుగారికిఁ పట్టాభిషేకము నిర్ణయింపఁబడెను. పరగ ణాయేగాక రాజధాని యంతయు నుత్సాహమతో నిండిపోయెను. రంగారావుగారికి ముప్పదియైదేండ్లు. ఆయన ఇంగ్లీషువిద్యలోఁ బట్టభద్రుడు. ఆధునిక మైన సంస్కారము కలవాఁడగుట చేత నా

5

ఐదవ అధ్యాయము

7 December 2023
2
0
0

వానలు సరిగాఁ దెఱపి యీయక మునుపే రంగారావుగారి చెన్నపురి చేరిరి. సుబ్బన్న పేఁట చెన్నపురివలె సుఖనివాస భూర కాదు. దొరలు, దొరసానులు, సినిమాలు, టీపార్టీలు, గవర్నరులు మహాధికారులు, తారురోడ్డు, సముద్రతీర విహారము

6

ఆరవ అధ్యాయము

7 December 2023
0
0
0

మఱునాఁడు ప్రొద్దున రంగాజమ్మగారి పొలము చేయుదున్నకాపు కట్టిన సవారిబండియెక్కి, ధర్మారావు తల్లితో అక్కగార్లతోరంగాపురము చేరెను. బానమి అఁదులు తానును నడచిపోయిరి.తన మంతయుఁ బెద్దబానగారు సూర్యనారాయణగారు చేసిరి.

7

ఏడవ అధ్యాయము

7 December 2023
0
0
0

ధర్మారావు గుంటూములోఁ జదువుమండెను. హాస్టలులో ము. గుంటూరు వెళ్ళినప్పటినుండియు ధర్మారావు తెలుఁగులు వ నారభించెను. కళాశాలలో సంస్కృతశాఖఁ దీసికొనెను. విమల కతనికి భాగనతముమీఁదఁ బ్రీతి. ఇప్పుడు భారతము చదున దలు

8

ఎనిమిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అషాఢ శుద్ధ పాడ్యమినాఁడు ధర్మారావు రాత్రి పదిగంటల పల గూర్చుండి యేవో వ్రాసికొనుచుండఁగాఁ గనులు మిఱుమిట్లుకొ తలయెత్తి పడమటి దిక్కు జూచెను. తనకన్నులలో నాడిన క్రొశ్యాని మెఱుఁగు పోయి దూరమున నుత్తరములోఁ దట్టమ

9

తొమ్మిదవ అధ్యాయము

8 December 2023
0
0
0

అట్లుగ ణాచారి పోయి కోటముందు నిలుచుండఁగా ఏవమ్మా! మేమి?" యని యడిగినవారు లేరు. ఆమె యట్లే నిలఁబడి తను లోపలినుండి యొకసారి రామేశ్వరముగారు వచ్చి ‘ఈ ముండ వచ్చిన దెందుల' కాని, వఱల లోనికిఁ బోయెను. పరి 1950 లె

10

పదియవ అధ్యాయము

8 December 2023
0
0
0

శశిని యొకనాఁ డొంటరిగా నడచి షి కారుపోయి పొలం మీఁద్ర రాతిరి వెన్నెలలోఁ గొంతనేపు విశ్రమించెను. సాక్ష లన్నియు దుక్కిదున్నిరి. కొన్ని చేలకు నీరు పెట్టి ముంజేత నూడ్చి చేలకు నీరెక్కి సంతనే యెచ్చటినుండి వచ్చె

11

పదకుండవా అధ్యాయము

8 December 2023
0
0
0

అప్పటికీ మహాత్ముఁడైన గాంధి సహాయనిరాకరణోద్యమ ఆరంభించి రెండేండ్లయినది. జనులు గాంధీ దేవుఁడై యవతరించె సి. ఆయన యే కృష్ణుఁడు. రాటము వేణువు, తన్మధురధ్వని నాదము, భారత దేశము బృందావనము. ప్రజలు గోపికలై దిని చెప్

12

పనెండవ అధ్యాయము

8 December 2023
0
0
0

పురపాలక సంఘ సౌథనిర్మాణము పూర్తియయ్యెను. కోటకు దేవాలయములకు మధ్యనున్న వీధికెదురుగా నుత్తరదిక్కున నున్న పొలాలలో నిర్మింబఁబడిన యా సౌధము గ్రామము నంతయుఁ పూచుచున్నట్లుండెను. కడచిః సంవత్సర మెనిమిదివేలును రాచర

13

పదమూడవ అధ్యాయము

8 December 2023
0
0
0

క్రొత్త సంవత్సరములో జాతీయ కళాశాలకుఁ ద్రో ఝుఁడు వచ్చెను. ఆయన పేరు శివరావు. ఆయన స్వగ్రామ ১১. ఆయన దండ్రి నెల్లూరులోఁ బూర్వము న్యాయ కొంత మర్యాదయుఁ, గొంత ధనము నార్జించెను. కరణోద్యమము ప్రారంభించినపుడు శివరా

14

పదునాల్గువా అధ్యాయము

8 December 2023
1
0
0

శాఖలఁ జూతకుసుమమేఖల ధరించి కుహుకుహూ యని వోయెను. దేవదాసి బంగారపు టొడ్డణవు గజ్జెలు ఘల్లుఘ్యం... మందయానము నెఱపెను. చూతవృక్షముల ఫలములు చెట్లనే 10జి రపువన్నె తిరిగి ప్రేక్షకులకుఁ దమ్గమాధుర్యమును తిసఁబడకుండగ

15

పదునైదవ అధ్యాయము

8 December 2023
0
0
0

గ్రీష్మము ప్రళయాకారము తాల్చి మహాతపము లొలుక ఆయుమును. సర్వజంతువులు మలమల మాడిపోయెను. అబ్బా! అ గ్రీష్మమునకుఁ దుదిలేదేమో యనుకొనుచుండఁగా నొకనాఁడు. జంట త్తుగ మేఘములు పట్టి కుండపోఁతఁగా గ్రుమ్మరించెను. మఱు పోల

16

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

17

పదహారవ అధ్యాయము

8 December 2023
0
0
0

సంవత్సరము తిరిగి వర్షర్తువు వచ్చినది. కిరీటి పరీక్ష యయ్యెను. సుబ్బన్నపేట వదలి వెళ్ళి నాల్గు నెలలయ్యెను. మొదటి నెల రోజువిడిచి రోజు ధర్మారావునకు జాబులు వ్రాసెను. విఆ యొక్కొక్కటి నాల్గు పుటలు. రెండవ నెలమ

18

పదిహేడువా అధ్యాయము

8 December 2023
0
0
0

సుబ్బన్న పేఁట తూర్పుది క్కతంయు గుండేటికి దక్షిణమున వంతయు, దాటితోఁవులు. పూర్వము చుట్టుపట్ల సంతయు మాగాని శానప్పుడు గ్రామము నాల్గువెవులఁ దాళవనములే శోభ తెచ్చినవి. ఆ యూరిలోఁ గలారీ లెక్కువమంది. వారందఱు తాళ్

19

పద్దెనిమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

"ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వచ్చితివి?మాటయనఁగా నిట్లుండవలయును. రెండు నెలలలోనే వచ్చెదనని చెప్పితివి. నా కేమితెలియును? నిన్నఁ జూచినదే యప్పుడాయెను. నీవు నిజమే చెప్పుదువనుకొంటిని" అన్న దనసూయ. 'నా దేమియుఁ దప్పుల

20

పందొమిదవ అధ్యాయము

15 December 2023
0
0
0

ధర్మారావు తెలుగువైద్యు నొకనిఁ బిలిపించి యరుంధతికి మందెప్పించుట ప్రారంభించెను. పదిరోజులైన తరువాత నామెకుఁ కొంచెము నెమ్మదిగా నున్నట్లే తోఁచెను. ధర్మారావు మందు పని చేయుచున్నదని సంతోషించెను. ఉండి నుండి వచ్

21

ఇరవైయవ అధ్యాయము

16 December 2023
0
0
0

ఒక్క సంవత్సరము గడచెరు. ఊరిలోనున్న యిండ్లెచ్చటి వచ్చటనే యుండును. అనంతాకాశమున నున్న స్వ గోళములకును రంతర పరిభ్రాంతిపెట్టి యా యా గోళములయందున్న ద్రవ్యమల కేలపెట్టలేదో! వీనికి బుట్టుట, చచ్చుట మాత్రమే కల్పించ

22

ఇరవైఒకటివ అధ్యాయము

16 December 2023
0
0
0

గణాచారి యన్నగారి భార్య రంగమ్మకుఁ జిన్నప్పటినుండియు నాఁడుబిడ్డ యింటిలోఁ బని చేయుచుండఁగాఁ దాను పోయి కొంచెము చిఱుపెత్తనము చేయట యలవాఁటు. తన కొడుకుల నిద్దఱిని నాగ మ్మకు వదలి పెట్టి, తాను సాయంకాలము వాహ్యాళి

23

ఇరవైరెండవ అధ్యాయము

18 December 2023
0
0
0

సుసాని ఇంగ్లండు పోయినతరు వాత సింహళముదాఁక నామెను బంపించుటకుఁ బోయిన రంగారావుగా రొక లంకిణిని దెచ్చెను. ఆమె పరాసు మనోహారిణి. సుసానీ మనసుమాత్రమేహరించె. ఈమె యసువులు, మనసు రెండును హరించెను. ఈమె పేరు 'బి. మాట

24

ఇరవైమూడవ అధ్యాయము

18 December 2023
0
0
0

కుమారస్వామికిఁ బుత్రోదయము, నుధ్యోగము నొక్కసారి యయ్యెను. కాలేజీలో నతఁదాంధ్రోపన్యాసకుఁ డయ్యెను. నెలకు నూటపాతిక రూపాయలు జీతము. ఆతఁడు తెలుఁగులో బీ. ఏ. పరీక్ష యిచ్చి యేడాదియైనది. ఈ యేడు ఎమ్. ఏ. పరీక్షకు వె

25

ఇరవైనాల్గువ అధ్యాయము

19 December 2023
1
0
0

"వాలి సుఖముగానున్నాఁడా?” “సుగ్రీవుని రమ్మనుచున్నాఁడు." “సుగ్రీవుఁడు నిదుర పోవు చున్నాఁడు. తన తారను గాఁజేసిన లిమీఁదఁ బగఁ దీర్చుకొనుట యెట్టాయని శ్రీరామ చంద్రుని 003 ప్రత్యగాత్మతో, సుషు వ్యవస్థలోఁ గలసి వ

26

ఇరవైఅయిదవ అధ్యాయము

19 December 2023
0
0
0

గార్డిన రన్న షదొర పులి లేడికై, పిల్లి యెలుకవై, బల్లి పురుగుకై, తొండచీమకై పొంచియున్నట్లు పసిరిక కై చాలసారులు పొంచియుండెను. ఎంత పొంచినను లేడి చెంగునదూకి తనజాతిలోఁ దూఱునట్లు, ఎలుక తప్పించుకొనునట్లు, పురు

27

ఇరవైఆరవ అధ్యాయము

20 December 2023
0
0
0

చైత్ర బహుళ ౧౫. ధర్మారావానాఁటి ప్రాతః కాలమునఁ గోటకుఁబోయి పదిగంటల కింటికి వచ్చేరు. అప్పటికి వంటకాలేను. ధర్మారా వముంధతిని వెదకెను. ఆమె దొడ్డిలోఁ గాఁకరపాదు ప్రస రించిన నీడలోఁగొంగువైచుకొని పరుండెను. చిక్కి

28

ఇరవైఏడవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణోత్సవములకు రమ్మని శశి రేఖాకిరీటులకు, పశుపతు, ఛా ఛాయాసూర్యపతులకును ధర్మారా పంపించెను. నాలుగైదేండ్లనుండి వారు వచ్చెదము వచ్చెన ను చున్నారు. కిరీటి తన పెండ్లినాఁడు మ్రొక్కుకొన్నాఁడు. ప్రతియేట “వచ్చి

29

ఇరవైఎనిమిదవ అధ్యాయము

21 December 2023
0
0
0

కల్యాణో”్సవము లన్న భావము కదలించగలిగినచోట్ల పేటను పేటను మట్టముగాఁ గదలించారు. పూర్వవు పేటవారు తమ యిండ్లలో వివాహము లగుట్లే భావించిరి. ఇండకు సున్నములు కొట్టిరి. జేరులు పెట్టిరి. గడపలకుఁ బచ్చాని తోరణాలు కట

30

ఇరవైతొమ్మిదవ అధ్యాయము

22 December 2023
0
0
0

అష్టమినాఁడు ప్రొక్రుంకినంతినే వ్నెలలు సితమిత్స్యపుష్ఛ కోచులువె'గ్రక్కెను. అపవారింపబడిన వేదముల కాంతులు మఱల బ్రహ్మదత్తయిలైన వేళ విశ సించినట్లు తం ధర్మములు నాల్గు మూలల వెదల్లిబట్లు, తద్గతసరస్వతీ సితిశి ర

31

ముప్పైయావ అధ్యాయము

22 December 2023
0
0
0

శాఖ బహుళామావాస్యనాఁడు ఎనుబదేండ్ల వృద్ధుఁ డొకఁడు సుబ్బన్న పేఁట స్టేషనులో రైలుదిగి పిచ్చివానివలె నాల్గు దిక్కులు ఔదం. కన్నుతోఁ జూచుచు నడచుకండేరు, అలెఁడు తుఁడె ప్రక్కనున్న యెవరినో చూచి 'ఆయ్యా! ఇది నిజ ము

32

ముప్పైఒకటవ అధ్యాయము

23 December 2023
0
0
0

ఆషాఢ శుద్ధ షష్ఠి, రాత్రి జాము ప్రొద్దుపోయివలెరు వాత చీకట్లు వచ్చెను. కుమారస్వామి మంగమ్మలు ధర్మారావుగారి యింటినుండి కలసి బొనచుండిరి కుమార: రెండు రో లనుండి మారింటిలో నుండుటలే:ఁట; ఎచ్చటికి. బోయిరి? మంగ:

33

ముప్పైరెండవ అధ్యాయము

23 December 2023
0
0
0

"ఏకాదశినాడు చనిపోయినది, ఆమె కేబిం? అదృష్టవంతు రాలు." "శా హ్యచేని.కబడినది" "మత్య్వారూపము మసకల దెలియలేదు. దా! "మె శాంతముగానే చికి పొయి యుండవచ్చును. " "అంత ఎనోనియనము స్థల యామె శాలేముగానే చనిపోయి కుమారస్

34

ముప్పైమూడవ అధ్యాయము

26 December 2023
0
0
0

రంగారావుగారు క్రమముగా నారోగ్యవంతులైరి. ఆయన కొన్నాళ్ళు మేకమీఁదనే యటు నీటు నడచెను. మఱి కొన్నాళ్ళు మేడదిగి కఱ్ఱపుచ్చుకొని కోటలోనే విహరింపఁజొచ్చెను. రోజురోజు నకు నాయన క్రమక్రమముగా నారోగ్యవంతుఁడయ్యెను. అరు

35

ముప్పైనాలుగవ అధ్యాయము

26 December 2023
0
0
0

"ఆయస నా కేసి కొడుకుకి నేనే మీకు గొడ కురు, మా తండ్రికే యతఁడ పుట్టి, నే సతిఃకి: బొబ్బరాదా? న్యాయముగా నుండి 1 అయినను నా చేతిలో బాదుగా దిగింది, యన చేతిలో నేలపాడగును? మరల సన్నాక హీఁ దూరు) జేసి పోయినాఁడు. న

36

ముప్ఫైఐదవ అధ్యాయము

26 December 2023
0
0
0

మందగించిన శఁఠస్వరమతో శక్తి యడిగికట్టు, తొక్కల తపతప కూడ సన్నగిల్లంగా జగమున కక్కఱలేని తమ వేశాప్రభోన కూజితము నిరుపయుక్త మగుట చేత సిగ్గుపడి సువ్య కర్వని యందుల గొఱఁత పడినట్లు, రాజ్యము పోయిన రాజు తలవంచియు జ

---

ఒక పుస్తకం చదవండి