'నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు ఆ యీ సం భాషణలలో వా రా భావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్ర మెన్ని యోమారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహాసామ్రాజ్యమును సుస్థిర మొనర్పజాలకు పోతిననియు దుఃఖించితిని, ఏమి రాజ్యములు, ఏమి రాజులు! కాకులపలె గ్రద్దలవలె సైన్యములు సమ కూర్చుకొని యనిత్యమును గశ్మలము నగు కీర్తికై యొకరి తల నొకరు నఱుకుకొనుచు, నొకరి రాజ్య మొకరు హరించు చున్నారు. '
'అవును కన్నతల్లీ ! నీవు బాలకుడవై పుట్టవలెనని వాంఛించిన ట్లీ నాటి నీ వేమమే నిదర్శనము, ఎంత జక్కగ నభినయించితివి. నాకు 'నీవు బాలకుడ వయియే జనించితి వేమో' యని యొక నిమేషమాత్ర మనిపించినది నీవన్నట్లు రాజ్యము లెప్పుడును పాపాకరములు. అహింసావ్రతమే ముక్తికి నిజమైన మార్గము. ఇతరులకు హాని చేయుటకన్న దన్నుదాను హింసించుకొని జిన దేవలోకము నార్జించుట పరమధర్మ మన్నారు...'
'ఏమి టా మాటలు జననీ! నే నీ వారము దీనముల నుండియు నేకారణముసనో ఆనందము నందుచు బొంగిపోవు చున్నాను. నా కీ పొడియారిన వేదాంతపు మాట లెందుకు? నా వివాహము విషయమై మాట్లాడుటకు దీసికొని వచ్చినారు. నే నొక పరమపురుసఃనికై యెన్ని యుగముల నుండి యో యెదురుజూచుచున్నట్లుగ దోచెడిది. నేడు నా మహాభాగుడు పిష్టపురమున దర్శనమిచ్చినాడు. వాతాపి చాళుక్య సామంతులలో నొకప్రభువు కుమారు డాతడు. పిష్టపుర రాణివాసపు టుద్యానమున నా వీరుని దర్శనమును హఠాత్తుగ బొందగలిగితిని."
'ఏమిటి? కన్నతల్లీ ! ఎవరిని దర్శించితే నంటివి?'
'నా చేయిని గ్రహించి, నన్నీ లోకయాత్రలో దివ్యపథములకు గొనిపోగలిగిననా నాయకుని సందర్శించితిని,
'అదేమి తల్లీ ! ఒక సామాన్య సామంతుని నీవు వలచినావా! ప్రేమించినావా!'
'అవును అమ్మగారూ! అవును, అది ప్రేమయో, వలపో నాకు దెలియదు. అతనికి నే నా పవిత్రతక్షణమున నే నా హృదయమును, సర్వస్వము నర్పించుకొంటిని, ఆయన సామాన్యుడగు సామంతుడైనను, చక్రవర్తియైనను నా శాతని స్థితితో నవసరము లేదు. ఆతడు చాళుక్య యువరాజైన విష్ణువర్ధన మహారాజుతో గలసి కళింగ గాంగ మహారాజులపై దాడి వెడలినాడు. నా హృదయ మాతని కర్పించితి సమ్మా.'
ఆ బాలిక మహారాణి కంఠమును బిగియార గౌగి లించి యామె హృదయమున దన మోము గాఢముగ నదిమి కొనుచు 'అమ్మా నా కే మహారాజును, జక్రవర్తియు వలదు. నా కేడుగడయైన యా ప్రియదర్శి నిర్వక్ర పరాక్రములని నా హృదయమున వెంటనే స్ఫురించినది' అని డగ్గుత్తిక పడ్డ మాటలతో నా బాలిక తన హృదయ రహస్యమును వెల్లడించెను.
మహారాణి నిరుత్తరయై యేమియు మాటాడ నేర క తన కూతును హృదయమునకు గాఢముగ హత్తుకొన్నది. మఱునాడు నారసింహ భట్టుపండితులవారిని విష్ణుకుండిన మహారాజు తమయాలోచనా మందిరమునకు రప్పించుకొనిరి,
'గురుదేవా! ఈ నాటి కమ్మాయి హృదయ మా ర్ద్రత నందినది. చాళుక్య యువమహారాజు సనుచరుడైన యొక సామంత యువకు నమ్మాయి వరించినదట. నా యాశలు భగ్నము లైన'వని దీనదృష్టుల జూచుచు మహా రాజు పలికెను,
నారసింహభట్ట పండితు లాశ్చర్యము వెలిబుచ్చుచు 'ఇదేమి మహాప్రభూ! ఈ సంఘటన యెట్లు ఘటిల్లినది 1
'అమ్మాయిని దుర్మార్గు లెత్తుకొనిపోవుట గోవూరు నందున్న తా మెఱుగుదురుగదా! వారు గాంగులై యుండ వలెను. కళింగగాంగ యువరాజుపై నాకు బూర్తిగ నను మాన మున్నది. పిష్టపురమునుండి గాంగుల దరిమి, యా నగరమును చాళుక్య విష్ణువర్ధనమహారాజు స్వాధీన మొనర్చు కొన్నప్పుడు అమ్మాయిని చెఱ విడిపించిన కొలది దినములకు నామె చాళుక్య సామంతుడైన యువకు నొకని జూచినదట. ఆ ముహూర్తముననే యాతడే తనకు గాబోవు భర్త యనినిర్ణయించుకొన్నదట. తాము దక్క యితరు లెవ్వరును మాకు సరియగు నాలోచన చెప్పువారు లేరు.'
'మహాప్రభూ! మీరు నన్ను ప్రశ్నించిన యీ సమ యమే మిక్కిలి యుత్తమము. రాజకుమారికి ఆ యువకుడే భర్త యగును, అతడే భావి యాంధ్ర సమ్రాట్టు,
'చాళుక్య విష్ణువర్ధన యువమహారాజు కళింగాధిపు లను బూర్ణముగ నోడించి వారినుండి ప్రాభృతము గైకొని యతి వేగమున వేంగీ రాష్ట్రముపై నెత్తివచ్చుచున్నాడట.'
'మహాప్రభూ! నేను మంత్రాంగముగ నాలోచించి నను, జ్యోతిషపరముగ విచారించినను దమ రాజ్యములో యుద్ధము పొసగ నేరదు. పులకేశి మహారాజు వచ్చినప్పుడును దామువారితో యుద్ధము సేయరైరి, మి మ్మా ప్రభువు పదచ్యుతుని జేయలేదు, సరిగదా, మీ రాజ్యమును సుస్థి రము సేయుటయే తన తలంపనియు మీ సహాయార్థము మాత్రమే తాను తన సేనాపతియగు పృథ్వీరాజేంద్రవర్మ నిచ్చట నుంచితి ననియు దెలిపిరిగదా! ఆ భావమునకు నేడేమియు భంగము జరుగదు.'
' ఏ దెట్లు జరుగునో చిత్రరథస్వామియిచ్ఛ.'
"వేంగీనగర మారుగోరుతముల పొడవును, నాలుగు గోరుతముల వెడల్పును గలిగిన మహానగరము. ఈ నగర మును నిర్మించిన వారు సాలంకాయన ప్రభువులు,కాయనులు శాతవాహనులలో నొక శాఖవారు. సాత వాహన శ్రీముఖ చక్రవర్తి, రాజబంధువగు కాన్హ సాలం కాయనుని ఆంద్ర కళింగ రాజ్యపు టెల్లలకాపాడ, రాజప్రతి నిధిగా నియమించి, గోదావరీతీరమున నొక దుర్గము నిర్మించు కొని, గోదావరీతీరము సంరక్షింప నాజ్ఞాపించెను.
గృధ్రవాడ విషయములో నాలుగు యోజనములు పొడవు, మూడు యోజములు వెడల్పు కలిగిన మహాసర స్సొకటి సొంపారి యున్నది. ఆ సరస్సులో ననేక చిన్న చిన్న నదులు సంగమించుచున్నవి. వేయి జలశకుంత సంతానజాతు లా కొలనులో నివసించుచు నిత్య కలకలారావ సంగీత మాల పించుచుండును, పోడశపత్రములు ద్వాత్రింశత్ పత్రములు, శతపత్రములు సగు కమలములును, గంగు రంగుల కలువ పూవులును ఆ సరస్సునకు అలంకారములై పరీమళములు వెదజల్లు చుండును,
ఆ కొలని పడమటి తీరమున పద్మానది సంగమించిన తీరభూమిని రెండు యోజనముల పొడవును, నొక యోజనము వెడల్పును గల నగరమును కాస్ట్ల సాలంకాయనుడు నిర్మించి నాడు.
సాలంకాయనుల కులదైవము చిత్రరథస్వామి, సొత వాహన సామ్రాజ్య మంతరించిన వెనుక యిక్ష్వాకులతో బాటు సాలంకాయనులు రాజ చిహ్నమైన 'భట్టారక' శబ్ద మును వహించిరి.విష్ణుకుండిన మంచన భట్టారక మహారాజు, కొమరిత అంశుమతి శత్రువుల బారినుండి తప్పించుకొని క్షేమముగ వేంగీపురము చేరినందులకు చిత్రకథస్వామిని స్వయ ముగ సర్చింప సకల సామంత సేనాధిప రాజోద్యోగి సహితముగ పాదచారియై దేవాలయమునకు బయలు దేరెను. సింహలాంఛిత విష్ణుకుండిన పతాక మెగురుచుండ, నా ధ్వజ మును మోయుచు పట్టపుటేనుగు ముందునడువ, వంది మాగధులు, నా వెనుక వేత్రహస్తులు 'జయజయ' ధ్వాన ములు సలుపుచు బారులుతీర్చి సడుచుచుండిరి.
వారివెనుక గంగా గోదావరీ కృష్ణాజలములు గల స్వర్ణ కుంభముల వహించిన ధవళవృషభముల నడిపించుచు, వేదమంత్రములు పఠించుచు బ్రాహ్మణులు నడుచుచుండిరి. వారి ననుసరించి, ముఖపతులు, దళపతులు, సేనాపతులు నడచుచుండిరి. సకల రత్నాలంకారయుక్తమైన సామ్రాజ్య శ్వేతచ్ఛత్రము పట్టి ఛత్రధారులు నడచుచుండ నా ఛత్రము క్రింద మహారాజు, రాజగురువు కై దండగొని, మదగజమువ లె గంభీరమున నడచుచుండెను. మహారాజు వెనుక సామంతులును, రాజబంధువులును ననుగమించుచుండిరి. పూజాద్రవ్యములు గ్రహించి బ్రాహ్మణపుణ్యస్త్రీ లావెనుక వచ్చుచుండిరి, ఎద్దులబండ్లు శతపత్రములు మోసికొనుచు వచ్చుచున్నవి.
మహారాణీయు రాజకుమారి అంశుమతియు శిబికలపై బరిచారికాజనములు గొలిచిరా జిత్రరథస్వామి కొలువునకువెడలుచుండిరి. దేవాలయ ప్రాంగణము, ప్రదక్షిణపథము, కల్యాణ మండపము, ముఖమండపము, గర్భాలయమును మనోహరాలంకారములతో ధగధగ వెలిగిపోవుచుండెను. నాగస్వర కాహళ, ముఖవీణ భే భౌంకారాది మంగళవాద్య ములు, దశదిశల నింపి వేయుచున్నవి. ఒక వైపున నాట్యాంగ నలు నాట్యకళావైదుష్యమును బ్రదర్శించుచుండిరి.
మూలవిరాటైన చిత్రరథస్వామి నవగ్రహ, అష్ట ది కాలాది ' పరివార దేవతలతో ఛాయాసంజ్ఞాసమేతుడై యా దేవాలయమున వేంచేసియుండెను. క్షేత్రపాలకుడై న కొలని భట్టారకేశ్వరుని యుపదేవాలయ మామహాక్షేత్రము సందున్నది. ఒక చో గొందరు బ్రాహ్మణు లాదిత్య మంత్ర మును జపించుచుండిరి.
దేవాలయమంతయు నొక మహారథమువలె నిర్మింప బడినది. ముఖమండపము ముందు నేనుగులంత పెద్దవియైన యేడు రాతిగుఱ్ఱములు గంభీర శిల్పాకృతిగలవి, ఆకాశమున నెగిరి పోవుచున్నట్లు విశ్వసింప బడినవి. వాని దోలబోవు చున్నట్లు గరుడాకృతిని ససూరుడు ముఖమండప పురోభాగస్థ మగు నొక చిరు వేదిక పై అధివసించి యున్నాడు.
చిత్రరథస్వామికి వైభవముగ బూజలు జరిగిపోయి నవి. ఆ దినమున మహారాజు రాజబంధుల కందరకు విందు చేసినాడు. బ్రాహ్మణులకు షోడశోపచారములును పోడళ మహాదానములు సలిపినాడు. ఆ మహానగరమునం దుండు జినాలయ సంఘారామాదులలో, బౌద్ధ సంఘారామ చైత్యా