"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలు లేక పోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవరకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొను చున్నాను.”
పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.
“సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుము విష్ణువర్ధనా!” అని పులకేశి తమ్ముని కళలలోనికి దీక్ష మైన చూపులు పరపి, మందహాసవదనుఁడై మాశీర్వదించెను. విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్వ దిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.
మధ్యదుర్గ గ్రామమువీడి, యాంధ్రమహా దేశము పలు తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయా ణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందింప కయు నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను.
వేంగీ రాష్ట్ర పశ్చిమారణ్యముల జొచ్చి విష్ణువర్ధనుడు తన సైన్యము నుత్తరదిక్కునకు మరలించినాడు. పిష్టపురకేశి బల్కినాడు. తమ్ముని చూడగనె చక్రవర్తికి గన్ను లానందమున జిగురించును, తన పుత్రులకన్న జిన్నతమ్ముని నెక్కువప్రేమతో బెంచుకొన్నాడు చాళుక్య సమ్రాట్టు, అన్నగారి యడుగుజాడలనే పూజించు విష్ణువర్ధనుడు తన కిరువది వేల బలగ ముండిన జాలునని కాలకంపనుని వెంట బెట్టుకొని విజయయాత్రకై వెడలుచుండును.
"విష్ణువర్ధనా! పిష్టపురదుర్గము కొండపై నిర్మింప బడకపోయినను స భేద్యమగుచోట కావున నా నగరముననే నీవు రాజధానీనగరము సేసికొని యాంధ్ర సామ్రాజ్య మొక టి పునర్నిర్మాణము సేయుమని నిన్నాశీర్వదించు చున్నాను.”
”మహాప్రభూ! పరమ మాహేశ్వరులైన మాలజ్ఞ యే నాకు శ్రీరామరక్షయు, మంత్రప్రసాదమును,”
" తమ్ముడా? నీవు రూపమున జిన్నవాడ వయిసను విక్రమమున, విజ్ఞానమున బెద్దవాడవు. నాయనా ! నీ వేల నింతవఱకు వివాహము చేసికొన నిరాకరించినాడవో నా కేమాత్రమును రహస్యము గోచరింపలేదు. రాజన్యులు సురూపలై, యుత్తమగుణాన్వితలైన తమబాలికల నీ కర్పింప నాకు బంపు రాయబారములు లెక్కింప నలవిగాదు గదా! నీ వన్నింటికి బెడ మొగము బెట్టితివి. నీ యిష్టానిష్టము లన్నియు హృదయమునకు సంబంధించినవి. అందు నేనేమి జోక్యము గలుగ జేసికొనగలను ! ""అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలు లేకపోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవరకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొను చున్నాను.”
పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.
"సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుమ విష్ణువర్ధనా!” అని పులకేశి తమ్ముని కలలోనికి దీక్ష మైన చూపులు పరపి, మందహాసవదనుఁడై రశీర్వదిం చెను విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్య దిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.
మధ్యదుర్గ గ్రామమువీడి, యాంధ్రమహా దేశము పల తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయ ణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందిం: కయు నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను,
వేంగీ రాష్ట్ర పశ్చిమారణ్యముల జొచ్చి విష్ణువర్ధనుడ తన సైన్యము ను తరదిక్కునకు మరలించినాడు. పిష్టపు"అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్ఛను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృద యమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలు లేకపోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవరకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొను చున్నాను.”
పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.
"సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుమ విష్ణువర్ధనా!” అని పులకేశి తమ్ముని కలలోనికి దీక్ష మైన చూపులు పరపి, మందహాసవదనుఁడై రశీర్వదిం చెను విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్య దిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.
మధ్యదుర్గ గ్రామమువీడి, యాంధ్రమహా దేశము పల తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయ ణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందిం: కయు నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను,
వేంగీ రాష్ట్ర పశ్చిమారణ్యముల జొచ్చి విష్ణువర్ధనుడ తన సైన్యము ను తరదిక్కునకు మరలించినాడు. పిష్టపుమును దిరిగి యాక్రమించుకొనిన గాంగులు విష్ణు వర్ధనుడు వేంగీనగరముపై పోవుచున్నాడని నమ్మిరి. వారట్లు నమ్ము టకే యా యువప్రభువు కాలకంపను నాలోచన పెడచెవిని బెట్టి, వేంగీనగరమున కే తనసైన్యముల నడిపించుకొని పోవు చున్నట్లే నటించినాడు. చాళుక్య సైన్యములు ప్రప్రథమము ననే వేంగీనగరమును ముట్టడించినచో శాంత చిత్తుడును దుర్బలుగును నగు విష్ణుకుండిన మహారాజు త్వరలో లోబడు నని పిష్టపురముపనుండిన గాంగులును, గాంచీపురమున నుండిన పల్లవులును అనుకొనిరి. వేంగీపురమున విష్ణువర్ధనుడు నిలిచి యున్నచో వాండకు ముట్టడింతురేమో యన్న భయము కాలకంపనునికి గలిగినది. ఆభావ మా యువరాజు గ్రహిం పక పోలేదు. కాని యాతడు తన రహస్యాలోచనల నేరి కిని దెలియనీయడు. కాలకంపనుడును సర్వసైన్యములును గూడ విష్ణువర్ధనుడు వేంగీపురాభిముఖుం డయ్యెననియే తలంచిరి. ఇప్పుడు చటుక్కున నా మహారాజు తన సైన్య ముల నుత్తరపు దిక్కునకు ద్రిప్పి కీకారణ్యములమధ్య నడి పించుకొని పోవునప్పుడు కాలకంపనునికి విష్ణువర్ధనుని హృదయ మర్థమైనది,
ఉన్నట్లుండి యొక రాత్రి చాళుక్య సైన్యములు పట్టిస మున కెదురుగనున్న తాళగ్రామము చేరుకొన్నవి.
యుదయమే నిశితబుద్ధిగల చాళుక్యచరులు గొందఱు గోదావరీతీరముననున్న కొన్ని గ్రామములలో నొకరికి తెలియ కుండ మరొకరికడ పడవలను తెప్పలను మాటలాడి యుంచినారు. ఆ నడికి రేయి పడవలు దెప్పలును దాళగ్రామము వైపు జేరినవి. అప్పుడే యచటికి విచ్చేసిన చాళుక్య సైన్యములు నిశ్శబ్దముగ నావలి యొడ్డున జేరినవి.
ఆవలి రేవు చేరుటేమి చాళుక్యసైన్యములు సువేగ మున దమ ప్రయాణములు సాగించినవి. గాంగుల సైన్యము లన్నియు పిష్టపురమున లేవు. గోదావరీతీరము పొడవు నను నా సైన్యములు కావలికాయుచుండెను. విష్ణువర్ధనుడు వేంగీపురమును బట్టుకొనిన వెనుక గోదావరిని దాటి, కళింగ మును జేరకుండ జేయుటయే వారితలంపు, విష్ణువర్ధనుడు ప్రయాణమాపక, పోయిపోయి పిష్టపురమును ముట్టడిం చెను,
పిష్టపుర సగరము చుట్టును మూడు మహాకుడ్య శ్రేణు లున్నవి. ఉత్తుంగములైన నలుబది రెండు గవను (బురుజు) లున్నవి. నగరము చుట్టును త్రవ్వని అగ డ్తయై హేలానది ప్రవహించును, వర్షాకాలమునందు దప్ప ఇతర సమయము లం దీ నదిలో నీరుడక పోవుటచే బిష్టపుర ప్రాచీన మహా రాజులైన మాఠరులును, వారి వెనుక సాలంకాయనులకు, విష్ణుకుండినులకును సామంతులైన రామకాశ్యపులుసు హేలా సదికి (నేటి యేలేరు) ఆనకట్టలు గట్టి, పండ్రెండు నెలలును లోతుగా నీరుండు.ఓట్లు చేసిరి. ఈ నది కుపశాఖలు నగరము నందు బ్రవహించుచు నొక్కొక శ్రేణికి నగ డ్తలుగా నేర్పడి నవి. బాహ్య కుఢ్యశ్రేణికన్న నెత్తైన మధ్యకుడ్య శ్రేణియు, నంతకన్నను నెత్తెయున్న యంతర్భిత్తి కాశ్రేణియు నొక దానికొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోపరి దేశమున నేనుగులు, రథములుగూడ బోగల మార్గములున్నవి. గవనులలో గోటగోడలపైన బృహత్పా ప్రాణ పాతన యంత్రములు, (పెద్ద రాతిబండలను విసరుయం త్రములు) ప్రచండాగ్ని బాణముల విసరుయంత్రములున్నవి.
కుబ్జ విష్ణువర్ధన మహారాజు సైన్యములతో బిష్టపుగ మును ముట్టడించునప్పటికి గోటగోడలపై లక్షలకొలది ధను ర్ధారులైన వీరులు కిటకిటలాడుచుండిరి, మొదటిగోడపై విలు కాండ్రును, కాగిన నూనె పోయువారును, సూరేకారము గంధకముతో సిద్ధము చేసిన యగ్ని బాణముల నుపయోగించు వారును అప్రమత్తులై యుండిరి. రెండవ గోడపైన శత ఘ్నుల (సూరు వాడిగల కత్తులు పొదిగిన పెద్దదూలము) నుపయోగించు సైనికులు, సేనాధిపతి యాజ్ఞకై వేచి మూడవదియగు లోనిగోడపైన భయంకరమైన పాషాణ పాతన యంత్రములు, చిన్న చిన్న కొండలంత రాళ్ళనై నను క్రోశము, రెండు క్రోశముల దూరము విసరి వైచుటకు నాయత్తముగ నున్నవి.
విష్ణువర్ధనుడు తన రెండులక్షల పదాతులను, పది వేల యాశ్వికులను, రెండు వేల రథికులను అయిదువందల యేనుగు లను గోటకు యోజన దూరమున జుట్టును వ్యూహము