కొకటి కాపుగాయుచుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలు బది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవ నులును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతి కుడ్యోపరి దేశమున నేనుగులు, రథములుగూడ బోగల మార్గములున్నవి. గవనులలో గోటగోడలపైన బృహత్పా ప్రాణ పాతన యంత్రములు, (పెద్ద రాతిబండలను విసరుయం త్రములు) ప్రచండాగ్ని బాణముల విసరుయంత్రములున్నవి.
కుబ్జ విష్ణువర్ధన మహారాజు సైన్యములతో బిష్టపుగ మును ముట్టడించునప్పటికి గోటగోడలపై లక్షలకొలది ధను ర్ధారులైన వీరులు కిటకిటలాడుచుండిరి, మొదటిగోడపై విలు కాండ్రును, కాగిన నూనె పోయువారును, సూరేకారము గంధకముతో సిద్ధము చేసిన యగ్ని బాణముల నుపయోగించు వారును అప్రమత్తులై యుండిరి. రెండవ గోడపైన శత ఘ్నుల (సూరు వాడిగల కత్తులు పొదిగిన పెద్దదూలము) నుపయోగించు సైనికులు, సేనాధిపతి యాజ్ఞకై వేచి మూడవదియగు లోనిగోడపైన భయంకరమైన పాషాణ పాతన యంత్రములు, చిన్న చిన్న కొండలంత రాళ్ళనై నను క్రోశము, రెండు క్రోశముల దూరము విసరి వైచుటకు నాయత్తముగ నున్నవి.
విష్ణువర్ధనుడు తన రెండులక్షల పదాతులను, పది వేల యాశ్వికులను, రెండు వేల రథికులను అయిదువందల యేనుగు లను గోటకు యోజన దూరమున జుట్టును వ్యూహములేర్పరచి, యింత దుర్భేద్యమగు కోటను సులభముగ బట్టు మార్గ మాలోచించుచు, నెక్కిన గుఱ్ఱమును దిగక, కంపన మహారాజుతోడను, ఆయన కొమరుడగు జయనంది తోడను, పిట్టపిడుగగు బుద్ధవర్మతోడను పిష్టపురదుర్గమునకు చక్రబంధమల్లి న స్కంధావారముచుట్టును తిరుగుచుండెను,
ఎట్టి దుర్గమదుర్గమునైనను విష్ణువర్ధను డవలీలగ బట్టగలుగువాడు. నున్నని ప్రపాతములు గలిగి, యనేక కుడ్య సంరక్షితములై మహోన్నతములైన పర్వతములందలి కోటలనైన నా చాళుక్యుడు సుఖముగ బట్టుకొన గలుగు టచే 'విషమసిద్ధి' యను బిరుదమును సముపార్జించెను. విషమసిద్ధి చాళుక్యు నెరిగిన వారెవ్వరును దిట్టములైనకోటలు తమ కున్నవనియు నా కోటలలో దలదాచుకొని, తమ్ము రక్షించుకొనవచ్చుననియు నిసుమంతయేని ధైర్యమువహించి యుండెడివారు కారు.
పుల కేశివల్లభు డేబది వేల యేనుగులను నిరువది వేల శతఘ్ని యంత్రములను, నొకలక్ష యగ్ని బాణ యంత్రము లను బ్రయోగించి పిష్టపురదుర్గమును బట్టుకొనఁగలిగెనట. ఆ పులకేశి వాతాపినగరము చేరినప్పటినుండియు దానార్ణవ గాంగ యువరాజు, చాళుక్య సైన్యములు దక్షిణమునకు బోవగనె, పిష్టపురము తిరిగి పట్టుకొనెను. కోటి కర్షపణ ములు వెచ్చించి మరల నాకోటను బాగు చేయించెను. పృథ్వీ మహారాజునకు "భట్టారక” నామము సమర్పించి, తనతోటి మహారాజని యాతని వేయివిధముల బొగడి, కళింగరాజ్యములోని కొన్ని విషయములను (భూభాగములు) గూడ నాతనికి ధారాదత్త మొనర్చి పృథ్వీమహారాజు కొమరునకు దన చెల్లెలు జాహ్నవీకుమారినిచ్చి, వివాహము చేసి రామ కాశ్య పులకును గాంగులకును గల సంబంధముం నెక్కువచేసెను, తన సైన్యము లనేకముల బృథ్వీమహారాజు సైన్యములతో గలిపి, పిష్టపురసుర్గమును మరియు దుర్గకము చేసెను.
కావున బృథ్వీమహారాజు తన కోటను ముట్టడించిన కుబ్జవిష్ణువర్ధనుని సైన్యమును జూచి, పకపక నవ్వుకొనెను. అంతటి మహాసైన్యములతో వచ్చిన పులకేశి చాళుక్యుడు పదునైదు దినములకుగాని పిష్టపురమును పట్ట లేకపోయినాడు. "ఈ మట్టగిడస పొట్టివాడు ఈ యీఁగ సైన్యముల దెచ్చి, యుక్కు గుండును తినదలచినాడు కాబోలు” నని తనకడ నున్న దానార్ణవ సేనాపతి కుంభకర్ణునివంటి కుంభమిత్రునితో నవ్వుచు బలికెను.
పృథ్వీ : కుంభమిత్రా ! కుబ్జవిష్ణువర్ధనుడు సూదులను బాణములుగ వేయునట కాదా!
కుంభ : మహాప్రభూ! సూదుల నెట్లు బాణములుగ వేయుదురు !
పృథ్వీ. నీవు ధనువున్నర పొడుగువాడవు. పొడగ రుల మైన మేము నీకడ పొట్టివారముగ గన్పింతుము. నీ పుపయోగించు గద ఒక ముప్పాతిక ధనువు పొడవుగలది. నే నుపయోగించు గద నీదానికన్న చిన్నది. నీ జానెడంత మనిషి యెంతగద నుపయోగించును ?కుంభ : ఆలాగునా అండీ! వ్రేలెకంత గద నుప యోగింపవచ్చును.
పృథ్వీ : కావుననే కుబ్జ విష్ణువర్ధనుడు సూదులను బాణములుగ నుపయోగించునని వింటిని.
కుంభ : ఆ సూదు లెంతదూరము పోవునో మహా
పృథ్వీ : మూరెడు దూరము పోవును.
కుంభ: అయినచో ఆ మహారాజు వానినుపయో గింప నేల ?
పృథ్వీ : ఆతడు పిల్ల వాడు గావున ఆటకై యవి యుప యోగించునఁట
కుంభ : అంత చిన్నపిల్ల వాడు యుద్ధమున కెట్లు వచ్చెను మహాప్రభూ!
ఈ రీతిగ పృథ్వీమహారాజు కుబ్జ విష్ణువర్ధనుని కుంభ మిత్రుని యెదుట హేళన చేసెను.
ఆవగింజంత మాత్రమె మెదడున్న కుంభమిత్రునకు ఆ అవహేళన మర్థము కాలేదు.
పృథ్వీమహారాజుసకు కుంభమిత్రునకు సంభాషణ కోట లోపలి గోడపై జరుగుచున్నప్పుడే, అశ్వారూఢులై కుబ్జవిష్ణు వర్ధనుడును, ఆయన ననుగమించిన కాలకంపన ప్రభువును, ఆతని కొమరుడు జయనందియు దమసైన్యముల వెనక నొక తోటలో నిలుచుండి యింకొక సంభాషణ నెరపుచుండిరి,