గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం.సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకులవలె చీకట్లు.
ఖండపరశుగళ కపాలగణముల కనుకొలకులలో ఒకటివలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది.గదిలోపల ఏవేవో ఆవిరులు.దూరాన నింగిమీదతోచిన ఒక చుక్కమిణుకు చూపులు మెలమెల్లగా విసిరిగదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.ఒక దురదృష్టజీవిఉదయం ఆరున్నరకుఆ గదిలోనే ఆరిపోయాడు.అతని దీపం ఆ గదిలో మూలనక్కి మూలుగుతున్నది.ప్రమిదలో చమురు త్రాగుతూ పలు దిక్కులు చూస్తున్నది.చీకటి బోనులో సింహములా నిలుచున్నది.కత్తిగంటు మీద నెత్తుటి బొట్టులాగున్నది.ప్రమిదలో నిలిచి పలుదిక్కులు చూస్తున్నది దీపం.అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశతారను చూసింది. రాకాసి కేకలు వేసింది.(నీకూ నాకూ చెవుల సోకని కేకలు.) ఆకాశతార ఆదరపుచూపులు చాపింది.కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా-హీనంగా చూడకు దేన్నీ!కవితామయమేనోయ్ అన్నీ!రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా- నీ వేపే చూస్తూ ఉంటాయ్! తమ లోతు కనుక్కోమంటాయ్!తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం- కాదేదీ కవిత కనర్హం! ఔనౌను శిల్ప మనర్హం!ఉండాలోయ్ కవితావేశం!దొరకదటోయ్ శోభాలేశం!కానీవోయ్ రస నిర్దేశం! కళ్ళంటూ ఉంటేచూసి, వాక్కుంటే వ్రాసీ!ప్రపంచమొక పద్మవ్యూహం!అలసిపోయింది పాపం, దీపం. ఆకాశతార ఆహ్వాన గానం చేసింది